Tuesday, 28 July 2026 11:13:59 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

పెన్షన్ డబ్బుల కోసం కారోబార్ లంచం...

Date : 08 January 2026 07:43 PM Views : 241

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామ పంచాయితీ కారోబార్ సురేష్ తన తల్లికి పెన్షన్ ఇప్పించడానికి పదిహేను వందల రూపాయలు తీసుకుని ఇప్పటికీ ఆ పని చేయలేదని బుసురాజుల రాజు ఆరోపించారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, తన తండ్రి బుసురాజుల మల్లయ్య నాలుగు నెలల క్రితం మరణించగా ఆ వృద్ధాప్య పెన్షన్ ను తన తల్లికి మార్చుకోవడానికి అవసరమైన సర్టిఫికెట్స్ కోసం పదిహేను వందలు అడుగగా కారోబార్ సురేష్ కు ఇచ్చినట్లు వివరించాడు. గత నాలుగు నెలలుగా తన తల్లికి పెన్షన్ రాకపోవడంతో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తాను హైదరాబాద్ లో పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారోబార్ లంచవతారం గురించి ఇప్పటికే పాత కొమ్ముగూడెం సర్పంచ్ దుమ్మని సత్యన్నకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. డబ్బులు తీసుకున్నప్పటికి కూడా పెన్షన్ ఇప్పించకుండా మనో వేదనకు గురి చేస్తున్న కారోబార్ సురేష్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :