Sunday, 13 September 2026 01:49:10 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచేందుకు అవిశ్రాంత పోరాటం

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 05 January 2026 05:19 PM Views : 228

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలో సోమవారం సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీని కార్మికులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూసింగరేణి సంస్థను ఒకప్పుడు కాకా వెంకటస్వామి పునఃరక్షించిన విధానమే తనకు స్ఫూర్తిగా మారిందని పేర్కొన్నారు. రిటైర్డ్ సింగరేణికార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని, ప్రస్తుతం అందుతున్న అరకొర పెన్షన్ సరిపోవడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ కార్మికుల పెన్షన్‌ను రూ.10,000లకు పెంచాలనే డిమాండ్‌ను పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ వంశీకృష్ణ వెల్లడించారు. ఈ అంశంపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ, తప్పకుండా సాధించి తీరుతానని రిటైర్డ్ కార్మికులకు హామీ ఇచ్చారు. అలాగే సింగరేణి పారిశ్రామిక ప్రాంతాలైన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి ద్వారా కార్మికుల ప్రయాణాలు సులభతరం చేయాలనే లక్ష్యంతో చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గడచిన పార్లమెంటు సమావేశాల్లో రూ.100 కోట్లతో ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఎంపీ వంశీకృష్ణ వెల్లడించారు. ప్రాంత అభివృద్ధిలో భాగంగా చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యత కలిగిన రామగిరి ఖిల్లా అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు కావడం ఆనందకర విషయం అని తెలిపారు. ఇందులో ఇప్పటికే రూ.1.5 కోట్లను అటవీ శాఖకు ఖిల్లా అభివృద్ధి పనుల కోసం అందజేశామని వివరించారు. రానున్న రోజుల్లో రామగిరి ఖిల్లాను ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, ప్రాంతానికి ఆదాయ వనరులు పెంచడమే లక్ష్యమని అన్నారు. కాకా వెంకటస్వామి, అలాగే ఎంపీగా వివేక్ సింగరేణి కార్మికుల ఆశీస్సులతో వారి సంక్షేమానికి చేసిన సేవలను స్మరిస్తూ, అదే బాటలో తాను కూడా మీ అందరి ఆశీస్సులతో కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. రిటైర్డ్ కార్మికుల గౌరవం, భద్రత, సంక్షేమమే తన రాజకీయ జీవిత లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :