ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాటారం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీ కరణ కోసం అమరులైన అమరులకు ఎమ్మార్పీఎస్ మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగిందనీ మండల అధ్యక్షుడు మంథేన చిరంజీవి మాదిగ అన్నారు. ఆయన మాట్లాడుతూ. మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితంలో భాగంగా అమరులైన వారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందని వారి త్యాగం వల్లనే వర్గీకరణ ఫలితాలు పొందుతున్నామని అన్నారు. అదేవి ధంగా ఎమ్మార్పీఎస్ సీనియార్ నాయకులు వేమునూరి జక్కయ్య మాట్లాడుతూ ఎస్సి సామాజిక వర్గంలో ఎన్నో పోరాటాలు చేసిన మందకృష్ణ మాదిగ పోరాటంతో పాటు అమరుల త్యాగాలు సైతం వెలకట్టలేనీవని పేర్కొన్నారు. అదే విధంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం బలమైన ఉద్యమం అని అమరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. వర్గీ కరణ ఫలితాలు మాదిగలు ఉప కులాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేమునూరి జక్కయ్య, ఆత్కూరి శంకర్, మంథేన సమ్మయ్య, తూకారం కోమురయ్య, దుర్గప్రసాద్, రాజేందర్, తోపాటు తదితరులు పాల్గోన్నరు.
Admin
E Nivas News