Monday, 14 September 2026 04:18:52 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

అభివృద్ధి పనులకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ నుండి సుమారు 200 వందల మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరికలు

Date : 24 January 2026 08:39 PM Views : 308

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో దాదాపు 200 మంది శనివారం చేరారు. చేరిన వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్త సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా మంచిర్యాలలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని పాలించిన 7 గురు ఎమ్మెల్యేలు చేయని అభివృద్ధిని నేను చేశానన్నారు. సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు రెండు నెలల్లో శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంలోని 282 పాఠశాలల్లో విద్య వ్యవస్థను ఆధునికరిస్తున్నా మన్నారు. కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి కోసం 150 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించానని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో త్రాగునీరు, సాగు నీటికి, మౌలిక సదుపాయాలకు ప్రజలు అనేకఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దండేపల్లి, లక్షెట్టిపేట్ మండలాల్లోని మోదెల, ద్వారక, గుడి రేవు, గూడెం గ్రామాలలో 4 మినీ లిఫ్ట్ నిర్మాణ పనులను అతిత్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా మంచిర్యాల నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల ను మంజూరు చేశామన్నారు. ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు ప్రజలను ఓటు అడిగే అర్హత లేదన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో 60 సీట్లు సాధించి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని నా అన్నదమ్ములుకి అక్క చెల్లెలుకి ఏ ఆపద వచ్చినా మీ అందరికీ నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు , నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :