Tuesday, 28 July 2026 09:26:24 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పించాలి

డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్

Date : 30 December 2025 04:17 PM Views : 280

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని పాత పెట్రోల్ బంక్ తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో పెద్దపల్లి-కాటారం ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ నిబంధనలను వాహనాదారులు పాటించడం లేదని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పనిచేసినప్పటికీని ట్రాఫిక్ నియంత్రణ చర్యలు లేకపోవడంతో వాహనదారులు ఇష్టానుసారంగా వెళుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనాలతో పాటు పలుచోట్ల చౌరస్తాల నుంచి రోడ్డు పైకి వాహనాలు చేరే క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెద్ద ఎత్తున వాహనాలు తిరిగే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పటికీని వాహనదారులకు అవగాహన లేక సిగ్నల్స్ పాటించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించి వాహనదారులు సిగ్నల్స్ పాటించే విధంగా ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని సురేష్ కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :