Monday, 14 September 2026 12:31:12 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

సమష్టి గా పని చేయండి...! మరిపెడ మున్సిపల్ బీఆర్ఎస్ దే

మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్

Date : 07 January 2026 01:44 PM Views : 329

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరిపెడ పురపాలికలోని 15 వార్డులతో పాటు చైర్మన్ స్థానం బీఆర్ఎస్ సునాయాసంగా గెలుచుకోనుందని మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌస్ లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర రావు అధ్యక్షతన జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సునాయాసంగా గెలిచారని స్పష్టం చేశారు. అదే స్పూర్తి తో పురపాలక ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటు లో ఉండే నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ మే నని స్పష్టం చేశారు. మరిపెడ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలతో సుస్థిరమైన అభివృద్ధి చేయటం జరిగింది అన్నారు. ఉమ్మడి జిల్లాకు ఇండోర్ స్టేడియం తలమానికంగా మారిందని, మున్సిపల్ పార్కు, మరిపెడ ఎస్సీ కాలనీ లో వ్యాయామ శాల, పల్లె, పట్టణ ప్రగతి పనులు, సెట్రల్ లైటింగ్ తో మరిపెడ దేదీప్యమానంగా కాంతులీ నిందని తెలిపారు. చేసిన ప్రగతి ని ప్రజల ముందు ఉంచి ఓటర్లను అభ్యర్థించాలని కోరారు. మరిపెడ పురపాలిక సునాయసంగా బీఆర్ఎస్ పార్టీ గెలవనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, డీఎస్ రవి చంద్ర, ఆయుబ్ పాషా, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పల వెంకటేశ్వర్లు, గంట్ల మహిపాల్ రెడ్డి, గంట్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల సతీష్, ఏరసాని రమణారెడ్డి, వెర్మా రెడ్డి రమేష్ రెడ్డి, ముదిరెడ్డి రంగారెడ్డి, గంట్ల శ్రీనివాస్ రెడ్డి, మధు, నరేష్, పానుగోతు వెంకన్న,సయ్యద్ లతీఫ్, మక్సుద్ద్, దిగజర్ల శ్రీనివాస్, గోల్కొండ వెంకన్న, చిదుముల సంతోష్, బిఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :