ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : హనుమకొండలోని గిరిజన భవన్ లో నిర్వహించిన అంతర్రాష్ట్ర కరాటే పోటీల్లో మంథని జపాన్ షిటోరియు షికోకై కరాటే ఇంటర్నేషనల్ శిక్షకులు కావేటి సమ్మయ్య, జడగల శివాని ఆధ్వర్యంలో దర్యాప్పూర్ ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ కేసరి సంతోష్ సహకారంతో మంథని, దర్యాప్తుర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు సబ్ జూనియర్ క్యాడిట్ జూనియర్ కథ, కుమితే విభాగాలలో అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు, వెండి, కాంస్య పథకాలు సాధించారు. మంథని విద్యార్థులు మాచర్ల శివ, జోగుల అభిరామ్, వాసంశెట్టి ఉదయ్, జడగల మనశ్వి బంగారు పథకాలు సాధించగా ముత్తారం మండలం దరియా పూర్ ఆదర్శ పాఠశాల బాలికలు 13 బంగారు, 10 వెండి, ఒక కాంస్య పథకాలను కైవసం చేసుకున్నారు. పథకాలు సాధించిన వారిని షిటోరియు సికోకాయ్ కరాటే ఇండియా, కియో అధ్యక్షులు భరత్ శర్మ, తెలంగాణ షిటోరియు సికో కాయి రిప్రెసెంటివ్ పాలకుర్తి పాపయ్య, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డు అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, షిటోరియు సికో కాయ్ కరాటే కార్య నిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, మల్యాల రామస్వామి, ఇన్స్ట్రక్టర్స్ నాగలి రాకేష్, రామ్ శెట్టి జయకృష్ణ, కావేటి శివ గణేష్ లు అభినందించారు.
Admin
E Nivas News