ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఆశ్వయుజమాసం శుక్లపక్షము శుక్రవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా భక్తులు శ్రీ గణ నాథున్ని దర్శించుకున్నారు. మంథని పట్టణంలోని శ్రీ మహా గణపతి ఆలయంలో స్వామివారిసేవకు విశేషoగా భక్తులు తరలి వచ్చారు. సంకటములు తొలిగిపోవాలంటే శ్రీ విఘ్నేశ్వరుని కృపాకాటాక్షములు లభించాలి. సంకటములు తొలగించేదే "సంకటహర వ్రతం". గణపతి ఆశీస్సులు పొందాలంటే 'సంకష్టహర చతుర్థి' రోజున చంద్రోదయం అనంతరం భోజనం చేయాలి. గణపతి విఘ్నాలను కలిగించే దేవుడని, ప్రతీ పనిలోనూ ముందుగా విగ్నేశ్వరున్ని పూజించాలి. సంకటహర వ్రతాన్ని ఆచరించడం వలన ఇబ్బందులు తొలగి అనుకున్న పనులు నెరవేరుతాయని శాస్త్ర ప్రవచనం. నెలలో బహుళములో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. అంటే పౌర్ణమి తరువాత 3-4 రోజులలో ఈ సంకటహర చవితి వస్తుంది. ఇక ప్రదోషకాలములో అంటే సూర్యాస్తమయ సమయములో ఏ రోజున చవితి ఉంటుందో ఆ రోజుననే సంకటహర చవితిని ఆచరించాలి. సాధారణంగా రెండు రోజులలో సూర్యాస్తమయ సమయానికి చవితి ఉండటం జరుగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగినప్పుడు రెండవ రోజునే సంకటహర చవితిని జరుపుకోవాలి. అవకాశాన్ని బట్టి 3,5,9,11,21 నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. సంకటహర వ్రతాన్ని నెలలో బహుళ చవితి రోజున ప్రారంభించాలి. ఈ వ్రతం చేపట్టడం వలస అనుకున్న పనులు నెరవేరుతాయని సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని శాస్త్రాల్లో వివరించబడింది.
Admin
E Nivas News