ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అదనపు ఎన్నికల అధికారి,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, నోడల్ అధికారి శంకర్ లతో కలిసి 1వ విడత, 3వ విడత స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్ నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్ అంశాలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూఎన్నికల నిర్వహణలో అధికారులకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, ఏర్పాట్ల పరిశీలన, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున అవసరమైన ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ, అధికారులు, సిబ్బందికి ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. నామినేషన్ల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల ఎంపిక,పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ,పోలింగ్, కౌంటింగ్ సమయంలో పాటించవలసిన నియమాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారుల బాధ్యత ఉంటుందని, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు,సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.కౌంటింగ్ సమయంలో ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా,పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ,ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.మాస్టర్ ట్రైనర్లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉన్నా శిక్షణ సమయంలో నివృత్తి చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు హరి ప్రసాద్, మధు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News