ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లాలోని కాటారం మండలం లోని పోతుల వాయి శివారులో గల భూమిని కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురుదేవుని వెంకటస్వామి అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. వివరాల్లోకి వెళితే మల్హాల్ రావు మండలానికి చెందిన అజ్మీర చందు నాయక్ అజ్మీర సమ్మయ్యలతో కలిసి ముత్యాల సత్యం అనే నన్ను నమ్మించి భూమి పట్ట చేస్తామని కొన్ని తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని కబ్జాకు పాల్పడ్డారని వివరించారు. గతంలో నాకు సంబంధించినటువంటి పోతుల వాయి శివారులో 235 సర్వే నెంబర్లో నేను అమ్మినట్లుగా ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్ వేసి పంచాయతీ కార్యదర్శి సరస్వతి చేసినట్టుగా 2001. సంవత్సరంలో ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి నా భూమిని కాజేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆ విషయ మై జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించగా ఆ రిజి స్ట్రేషన్ మోసం అని తేలిందని, వీరితో పాటు ఒక్క ప్రభుత్వ టీచర్ కలిసి నా భూమి అమ్మినట్టుగా తప్పుడు ప్రచారం చేసుకుంటూ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని నా భూమి నాకు చెందే విధంగా చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Admin
E Nivas News