ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి కోరారు. మంగళవారం సిపిఎం కార్యాలయంలోజిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ కనికరపు అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో వరద ముంపు సమస్య పై, బై పాస్ రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై రోడ్డు నిర్మాణం చేయాలని, సంగమళ్ళయ్య పల్లె నందు ఒర్రెపై బ్రిడ్జి నిర్మించాలని దీక్ష చేపట్టామన్నారు. డ్రైనేజీ, దోమల నివారణకు, సీసీసీ నస్పూర్ బస్టాండ్ వద్ద బస్సు షెల్టర్ , టాయిలెట్స్ ఏర్పాటు కై మరియు ఇతర సమస్యల పరిష్కారం కొరకు పార్టీ నిరంతరం పోరాడుతుంది. అదే విదంగా లక్షేట్టిపేట్, చెన్నూరు, క్యాతనుపల్లి, బెల్లంపల్లి పట్టణంలోని రోడ్డు వెడల్పు లో ఇండ్లు కోల్పోయిన ప్రజలకు నష్టపరిహారం, ఇండ్లు నిర్మించి ఇవ్వలని మరియు ప్రజలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ పట్టణల అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడుతున్నా మన్నారు.రాబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ మరియు వార్డ్ ల ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించి పట్టణ అభివృద్ధికి పాటుపడాలని జిల్లాలోని మున్సిపాలిటీల ప్రజలను కోరుతున్నాం. ఈ సమావేశంలో ఎర్మ పున్నం, గోమాస ప్రకాష్ , బోడేంకి చందు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, దుంపల రంజిత్ కుమార్, కొండగొర్ల లింగన్న, ప్రేమ్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Admin
E Nivas News