ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలలో గుట్టపై వెలసిన మల్లికార్జున స్వామిని శివరాత్రి పర్వదినాన ఆదివారం రాష్ట్ర మంత్రి వివేక్ తో పాటు ఆయన సతీమణి సరోజ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఒగ్గు పూజారులు వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వివేక్ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా దాదాపు మూడు కిలోమీటర్లు గుట్టపైకి నడిచి స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రజలంతా చల్లగా ఉండాలని పూజలు చేసినట్లు తెలిపారు. అనంతరం చెన్నూరు మండలంలోని కత్తెరసాల మల్లన్న స్వామిని కూడా దర్శించుకుని పూజలు నిర్వహించి అక్కడ కూడా శివుడు అందరిని చల్లగా చూడాలని కోరినట్లు తెలిపారు. ఉదయం నుండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి పక్కనే గల పుణ్య గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుని పునీతులయ్యారు. వేలాదిమంది భక్తులతో రావడంతో క్షేత్రాలు జన సందోహంతో శివనామస్మరణతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చాలామంది భక్తులు రాత్రి ఆలయ సమీపంలో జాగరణ కూడా చేయనున్నారు. వీరందరికీ షామియానా లు ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. మంత్రి వెంట నాయకులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News