ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో మార్పు అవసరమని, నిజాయితీ, అంకితభావం గల నాయకులుంటే తమిళనాడు తరహాలో మార్పు తీసుకురాగలమని అన్నారు. హైదరాబాద్లో కళాకారుడు ఏపూరి సోమన్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో సంబంధం లేనివారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించడం బాధాకరమని, గతంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నవారు అధికారంలో ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికిగాను మార్పు తీసుకురావాలని ఆలోచన చాలామంది కి ఉందని వారు బయటకి రావడంలేదని తెలిపారు.
Admin
E Nivas News