ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాల్లోని పలు కూడళ్లలో ప్లేకార్డులు పట్టుకొని ర్యాలీలు నిర్వహించి ఓట పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు అనేది హక్కు కాదు ప్రజాస్వామ్యమైన బాధ్యత అన్నారు.జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయాలతో పాటు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఓటు విలువపై యువతరానికి అవగాహన కల్పించారు. ఇలాంటి స్వార్థానికి లోను కాకుండా తమ ఓటు హక్కును సరైన వారికి వినియోగించుకున్నట్లయితే రాష్ట్రంతో పాటు ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. డబ్బులు తీసుకొని ఓటు వేసినట్లయితే గ్రామాల నుండి మొదలుకొని పట్టణాల వరకు అభివృద్ధి చెందే అవకాశం లేదని తెలిపారు. మద్యానికి డబ్బుకు లోబడి ఓటు వేయవద్దని ఓటు ఒక మనిషి యొక్క ప్రాణంతో సమానమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులు నాయకులు, యువకులుపాల్గొన్నారు.
Admin
E Nivas News