Wednesday, 29 July 2026 12:04:56 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల నియమాలను పాటించాలి...

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

Date : 10 February 2026 08:22 AM Views : 150

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలో జరిగే ప్రతి ఒక్క వార్డులో పోలీసు లు సూచించిన నియమాలను పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ స్థానిక టిటిడిసి నందు జరుగుతున్న ఏర్పాట్లను సిబ్బందికి బందోబస్తు పై జిల్లా ఎస్పీ పరిశీలించి, పలు సూచనలు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల ను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని 100 మీటర్ల వద్ద 200 మీటర్ల వద్ద ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని వాటిని పాటించాలని, ప్రజల అనవసరంగా గుమిగూడి ఉండరాదని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలోనికి సెల్ఫోన్లు, వాటర్ బాటిల్ లు, ఇంకు బాటిల్లు, ఆయుధాలు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వాటికి అనుమతులు ఉండవని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ పద్ధతిని పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రాలలోనికి అనుమతి ఇస్తారని తెలిపారు. తమ వెంట ఓటర్ ఐడి కార్డులను, గుర్తింపు కార్డులను తెచ్చుకోవా లన్నారు. వాట్సాప్ నందు సోషల్ మీడియా నందు ఇతరులకు రెచ్చగొట్టేలా కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పట్టణంలో సోమవారంసాయంత్రం 5 గంటల నుండి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమవుతుం దని, ప్రచారాలు నిషేధం చేయబడతాయన్నారు. బయట వ్యక్తులు పట్టణంలో ఉండరాదు. ఎలాంటి సమాచారం అయినా డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని, గొడవలకు, అల్లర్లకు పాల్పడ కూడదన్నారు. అనుమతులు లేనిదే ర్యాలీలు నిర్వహించ రాదని, ర్యాలీలలో టపాకాయలు పేల్చ రాదన్నారు. సున్నితమైన ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహిస్తూ ప్రజలలో పోలీసుల పట్ల ధైర్యం నమ్మకం పెంపొందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండాప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేయడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినమైన చర్యలతో విధులను నిర్వర్తిస్తుందని తెలిపారు. ఎలాంటి సమాచారం అయినా డయల్ 100 ద్వారా పోలీసు సహాయాన్ని సంప్రదించవచ్చు నని అదేవిధంగా డబ్బు, మద్యం, బహుమతులు లాంటివి పంచే క్రమంలో పోలీసులకు సమాచారం అందించాలన్నారు.పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, మావల సీఐ కర్రె స్వామి, నూతన మున్సిపల్ కమిషనర్ రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :