ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలో జరిగే ప్రతి ఒక్క వార్డులో పోలీసు లు సూచించిన నియమాలను పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ స్థానిక టిటిడిసి నందు జరుగుతున్న ఏర్పాట్లను సిబ్బందికి బందోబస్తు పై జిల్లా ఎస్పీ పరిశీలించి, పలు సూచనలు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల ను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని 100 మీటర్ల వద్ద 200 మీటర్ల వద్ద ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని వాటిని పాటించాలని, ప్రజల అనవసరంగా గుమిగూడి ఉండరాదని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలోనికి సెల్ఫోన్లు, వాటర్ బాటిల్ లు, ఇంకు బాటిల్లు, ఆయుధాలు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వాటికి అనుమతులు ఉండవని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ పద్ధతిని పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రాలలోనికి అనుమతి ఇస్తారని తెలిపారు. తమ వెంట ఓటర్ ఐడి కార్డులను, గుర్తింపు కార్డులను తెచ్చుకోవా లన్నారు. వాట్సాప్ నందు సోషల్ మీడియా నందు ఇతరులకు రెచ్చగొట్టేలా కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పట్టణంలో సోమవారంసాయంత్రం 5 గంటల నుండి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమవుతుం దని, ప్రచారాలు నిషేధం చేయబడతాయన్నారు. బయట వ్యక్తులు పట్టణంలో ఉండరాదు. ఎలాంటి సమాచారం అయినా డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని, గొడవలకు, అల్లర్లకు పాల్పడ కూడదన్నారు. అనుమతులు లేనిదే ర్యాలీలు నిర్వహించ రాదని, ర్యాలీలలో టపాకాయలు పేల్చ రాదన్నారు. సున్నితమైన ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహిస్తూ ప్రజలలో పోలీసుల పట్ల ధైర్యం నమ్మకం పెంపొందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండాప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేయడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినమైన చర్యలతో విధులను నిర్వర్తిస్తుందని తెలిపారు. ఎలాంటి సమాచారం అయినా డయల్ 100 ద్వారా పోలీసు సహాయాన్ని సంప్రదించవచ్చు నని అదేవిధంగా డబ్బు, మద్యం, బహుమతులు లాంటివి పంచే క్రమంలో పోలీసులకు సమాచారం అందించాలన్నారు.పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, మావల సీఐ కర్రె స్వామి, నూతన మున్సిపల్ కమిషనర్ రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News