Thursday, 30 July 2026 05:03:39 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

సిరిపురంలో ప్రత్యేక పశు వైద్య శిబిరం

Date : 07 February 2026 09:32 AM Views : 178

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్, పెద్దపెల్లి జిల్లా కలెక్టర్, జిల్లా పశు వైద్య పశు సంవర్దక శాఖ పెద్దపల్లి జిల్లా వారి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం (NSS) ఏడు రోజుల కార్యక్రమంలో భాగంగా 6వ రోజు మంథని మండలం సిరిపురం గ్రామంలో శుక్రవారం ప్రత్యేక పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక పశు వైద్య శిభిరంలో జబ్బు పడిన 483 పశువులకు చికిత్స, 182 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు గాలికుంటు, ముద్దచర్మవ్యాధి మరియు రేబిస్ టీకాలు చేయడం జరిగింది. అలాగే 22 పశువులకు చూడి పరీక్షలు, 8 పశువులకు గర్భకోష వ్యాధులకు చికిత్స అందించడం జరిగింది. 330 దూడలకు నట్టల నివారణ మందులు 2 పశువులకు శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగింది. అంతే కాకుండా పాడి పశువుల, జీవాల యజమాన్య పద్దతులు, పశుపోషణతో పాటు వివిధ రకాల పశు గ్రాసాలపై సాగు పై పాడి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.అని మంథని మండల పశువైద్య అధికారి డాక్టర్ టి.రవి కుమార్ వెల్లడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె.విజయ భాస్కర్, హైదరాబాద్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ లత, డాక్టర్ డి.అనుష, డాక్టర్ ఎస్.ప్రత్యూష, మేఘా నాయక్, పి.జి., .జీ విద్యార్థులు సహాయక సిబ్బంది పాల్గొన్నారు. వారితో పాటు సిరిపురం సర్పంచ్ గోదారి లక్ష్మీ రాయమల్లు,ఉప సర్పంచ్ ఈసంపల్లి నారాయణ, వెటర్నరీ లైవ్‌స్టాక్అధికారి బి.హన్మండ్లు, వెంకన్న వాక్సీ నెటర్ అజయ్ గోపాలమిత్రాలు పానుగంటి సంజీవ్ కుమార్, కొండయ్య, రామకృష్ణ, మల్లేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :