ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్, పెద్దపెల్లి జిల్లా కలెక్టర్, జిల్లా పశు వైద్య పశు సంవర్దక శాఖ పెద్దపల్లి జిల్లా వారి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం (NSS) ఏడు రోజుల కార్యక్రమంలో భాగంగా 6వ రోజు మంథని మండలం సిరిపురం గ్రామంలో శుక్రవారం ప్రత్యేక పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక పశు వైద్య శిభిరంలో జబ్బు పడిన 483 పశువులకు చికిత్స, 182 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు గాలికుంటు, ముద్దచర్మవ్యాధి మరియు రేబిస్ టీకాలు చేయడం జరిగింది. అలాగే 22 పశువులకు చూడి పరీక్షలు, 8 పశువులకు గర్భకోష వ్యాధులకు చికిత్స అందించడం జరిగింది. 330 దూడలకు నట్టల నివారణ మందులు 2 పశువులకు శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగింది. అంతే కాకుండా పాడి పశువుల, జీవాల యజమాన్య పద్దతులు, పశుపోషణతో పాటు వివిధ రకాల పశు గ్రాసాలపై సాగు పై పాడి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.అని మంథని మండల పశువైద్య అధికారి డాక్టర్ టి.రవి కుమార్ వెల్లడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె.విజయ భాస్కర్, హైదరాబాద్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ లత, డాక్టర్ డి.అనుష, డాక్టర్ ఎస్.ప్రత్యూష, మేఘా నాయక్, పి.జి., .జీ విద్యార్థులు సహాయక సిబ్బంది పాల్గొన్నారు. వారితో పాటు సిరిపురం సర్పంచ్ గోదారి లక్ష్మీ రాయమల్లు,ఉప సర్పంచ్ ఈసంపల్లి నారాయణ, వెటర్నరీ లైవ్స్టాక్అధికారి బి.హన్మండ్లు, వెంకన్న వాక్సీ నెటర్ అజయ్ గోపాలమిత్రాలు పానుగంటి సంజీవ్ కుమార్, కొండయ్య, రామకృష్ణ, మల్లేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News