ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు పట్టణాలు పల్లెలలో వనదేవతలైన సమ్మక్క, సరళమ్మ జాతరలను ఏర్పాటు చేయడంతో వేలాదిగా మంది వ్యక్తులు వనదేవతల గద్దల వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ పట్టణాలు పల్లెల్లో కూడా ఆచారం ప్రకారం కోయ పూజారులే వచ్చి అమ్మవార్లను గద్దలపై ప్రతిష్టింపజేసి పూజలు చేయడంతో ప్రారంభమయ్యాయి. మేడారంలో ఎలాగా అమ్మవార్లను ఆహ్వానం పలుకుతారు అలాగే ఇక్కడ కూడా జాతర ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కూడా అంతే ఆనందం చాలా మధ్య బుధవారం సారలమ్మను, గురువారం సమ్మక్కను ఆనందోత్సాహాల మధ్య భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు ఆహ్వానం పలికారు. పలుచోట్ల మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు కూడా వనదేవతలకు మొక్కులు సమర్పించుకొని బంగారం వారి ఎత్తు బెల్లాన్ని సమర్పించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలంతా మంచిగా పంటలు పండి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని వనదేవతలకు మొక్కుకున్నట్లు తెలిపారు. సమ్మక్క రాకతో భక్తులు పట్టలేని సంతోషంతో వనదేవతలను దర్శించుకుని వారి యొక్క ముక్కులైన చీరేసారలతోపాటు మేకలు, కోళ్లను బలి ఇచ్చి నైవేద్యంగా పెట్టి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనదేవత దర్శనానికి వచ్చిన భక్తచనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీల ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు యంత్రంగా కూడా భారీ భద్రత ఏర్పాటు చేసింది.
Admin
E Nivas News