ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం నూరు శాతం రాయితీపై రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తుందని మంత్రి వివేక్ పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లోని గొల్ల వాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను వదిలారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రోటీన్ కావాలంటే చేపలు తినాలి అందులో న్యూట్రిషన్ ఉంటుం దని గొల్లవాగు ప్రాజెక్టును మా నాన్న కాక వెంకటస్వామి కట్టించారన్నారు. జూబ్లీహిల్స్ లో మాత్యకారులు కాంగ్రెక్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని తెలిపారు. చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తా అని హామీనిచ్చారు. మీ అందరికోసం భీమారంలో సొసైటీ కోసం భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఫిష్ మార్కెట్ కావాలని కోరారు,విద్యుత్ లైన్స్ కావాలని అడిగారు, చెరువు పూడిక తీత చెరువులో చెట్లు తొలగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి వెంట మత్స్యశాఖ అధికారులు, గంగ పుత్రులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News