Tuesday, 28 July 2026 08:35:03 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి

Date : 14 January 2026 07:52 PM Views : 107

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మకర సంక్రాంతి పర్వదినమును పురస్కరించుకొని మంథని పురపాలక సంఘం పరిధిలోని శ్రీపాద కాలనీలో బుధవారం మూల సరోజన పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ నాయకుడు బెజ్జంకి డిగంబర్ పర్యవేక్షణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల సరోజన పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే ముగ్గులతో మన ముంగిల్లు కళకళలాడుతాయన్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంక్రాంతి పండుగ రోజున ముగ్గుల పోటీలు నిర్వహించడం మన సాంప్రదాయమన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగు రంగుల ముగ్గులు ఇంటి ముందట వేస్తారని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపి గెలుపొందిన విజేతలను అభినందించారు. పోటీలలో 25 మంది మహిళలు పాల్గొని వేసిన వివిధ రకాల రంగవల్లులు పలువురిని ఆకట్టుకున్నాయి. మాజీ జెడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ ఓడ్నాల ప్రవళిక శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రథమ బహుమతి కొమురోజు సరిత, ద్వితీయ బహుమతి చేమంతుల శ్రీవాణి, తృతీయ బహుమతి ఎస్ మనస్విలకు బహుమతులు ప్రధానం చేశారు. అంతేకాకుండా పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మూల పురుషోత్తం రెడ్డి, ఒడ్నాల శ్రీనివాస్, అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: