Thursday, 15 January 2026 05:42:31 PM
# చిదినేపల్లి పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి # రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు.. # ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం # శ్రీ గోదా దేవి రంగనాథ కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న కోనేరు కోనప్ప.. # రాజురా లో ఘనంగా ముగ్గుల పోటీలు.. # ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం... # విద్యార్థిని మృతదేహానికి నివాళులు అర్పించిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి # భూ భారతి చలాన్ల స్కామ్‌లో అధికారుల పాత్ర పై దర్యాప్తు ముమ్మరం... # రోడ్డు భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ # అయ్యప్ప వాడలో భోగి మంటలు కార్యక్రమం # సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ భాష # రక్తదానంపై అపోహలు వద్దు- రక్త దానం చేసిన లింగాల గ్రామ యూత్ ను అభినందించిన ఎస్ఐ- పి.తిరుపాలు # శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి # మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీరెల్లి రజిని కుమార్ # సరస్వతి అంత్య పుష్కరా లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి # మన భారత దేశ ప్రజలందరికీ పేరుపేరునా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు # కించపరిచే ఆరోపణలపై సిట్ ఏర్పాటు.. # పండగలు సంతోషంగా జరుపుకోవాలని మా లక్ష్యం # రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత... # ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరితగతిన నిర్మించాలి...

శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి

Date : 14 January 2026 07:52 PM Views : 21

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మకర సంక్రాంతి పర్వదినమును పురస్కరించుకొని మంథని పురపాలక సంఘం పరిధిలోని శ్రీపాద కాలనీలో బుధవారం మూల సరోజన పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ నాయకుడు బెజ్జంకి డిగంబర్ పర్యవేక్షణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల సరోజన పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే ముగ్గులతో మన ముంగిల్లు కళకళలాడుతాయన్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంక్రాంతి పండుగ రోజున ముగ్గుల పోటీలు నిర్వహించడం మన సాంప్రదాయమన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగు రంగుల ముగ్గులు ఇంటి ముందట వేస్తారని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపి గెలుపొందిన విజేతలను అభినందించారు. పోటీలలో 25 మంది మహిళలు పాల్గొని వేసిన వివిధ రకాల రంగవల్లులు పలువురిని ఆకట్టుకున్నాయి. మాజీ జెడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ ఓడ్నాల ప్రవళిక శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రథమ బహుమతి కొమురోజు సరిత, ద్వితీయ బహుమతి చేమంతుల శ్రీవాణి, తృతీయ బహుమతి ఎస్ మనస్విలకు బహుమతులు ప్రధానం చేశారు. అంతేకాకుండా పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మూల పురుషోత్తం రెడ్డి, ఒడ్నాల శ్రీనివాస్, అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :