ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నిరుపేద పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న "గుమ్మడి రాజలింగు ఫౌండేషన్" సేవలు ప్రశంసనీయమని జన్నారం అటవీ డివిజన్ అధికారి రామ్మోహన్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట జడ్పి ఉన్నత పాఠశాలలో జడ్పీ ఉన్నత పాఠశాలలో "గుమ్మడి రాజలింగు ఫౌండేషన్" ఆధ్వర్యంలో విద్యా, క్రీడా సామాగ్రి బుధవారం విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివి పేద విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా, విద్యా సామగ్రి అందజేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని చదువుల్లో, క్రీడల్లో రాణించాలన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గుండేటి రాజవర్ధన్, డీఆర్వో మమత, స్థానిక హెచ్ఎం బోయినీ శ్రీనివాస్, తాళ్లపేట మాజీ ఎంపీటీసీ కంది హేమలత - సతీష్ కుమార్, గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ గుమ్మడి కిరణ్ కుమార్, ఎఫ్ బి ఓ రహిమొద్దీన్, శివ గణేష్ యూత్ అధ్యక్షులు దుర్గం రవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Admin
E Nivas News