Wednesday, 29 July 2026 12:05:51 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఏప్రిల్ నెలాఖరు నాటికి అయ్యగారి చెరువు రీ- మోడలింగ్ పనుల్లో 50 శాతం పూర్తి చేయాలి

కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Date : 03 April 2026 11:41 PM Views : 204

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి : మంథని ముత్తారం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు సమయానికి నాణ్యతతో పూర్తి కావాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముత్తారం మండలం దర్యాపూర్ ఆదర్శ పాఠశాలలో కోటి రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను, మంథని పట్టణంలోని అయ్యగారి చెరువు రీ మోడలింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. అభివృద్ధి పనులు సమయానికి, నాణ్యతతో పూర్తి కావాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనుల పురోగతి పై సమగ్రంగా ఆరా తీసి, ఇప్పటికే ఆమోదించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు పనుల కోసం మరిన్ని నిధులు అవసరమైతే వెంటనే అంచనాలు సిద్ధం చేసి సమర్పించాలని, అంచనాలు అందిన వెంటనే అవసరమైన అదనపు నిధులను మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం మంథని మున్సిపాలిటీ పరిధిలోని అయ్యగారి చెరువు రీ-మోడలింగ్ పనులను కలెక్టర్ పరిశీలించి చెరువు పునర్నిర్మాణ పనులను వచ్చే సోమవారం నుంచి ప్రారంభించాలన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్రతిపాదిత పనుల్లో కనీసం 50 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు వేగవంతంగా, నాణ్యతతో కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :