ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బహుజన బంధువులారా ఐక్యం కండి రానున్నది ఏనుగు ప్రభుత్వమేనని పెద్దపల్లి ఇన్చార్జులు కాదాసీ రవీందర్, మల్లేష్ లు తెలిపారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణం నందు బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షత న సోమవారంజిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్చార్జిలు కాదాసి రవీందర్, వర్కిల్ల మల్లేష్ లు హాజరై మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో పార్టీని గ్రామ గ్రామాన నిర్మాణం చేయాలని ఈనెల 13వ తారీకు వరంగల్ జోన్ -2 సమీక్షా సమావేశం ఉందన్నారు. ఈ సమావేశానికి మంచిర్యాల జిల్లా కమిటీ మరియు మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల కమిటీల నాయకులు హాజరై విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. బహుజన బంధువులారా ఏకంకండి, రానున్నది ఏనుగు ప్రభుత్వమన్నారు. అనంతరం మంచిర్యాల నియోజకవర్గం లోని బండారి రాజ్ కుమార్ నీ పెద్దపెల్లి పార్లమెంట్ ఇంచార్జి ల సమక్షంలో పార్టీ కండువా కప్పి జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ బండారి రాజ్ కుమార్, పులాల రమేష్ ల ను మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జి లుగా నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్ నాగుల కిరణ్ బాబు, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగం శ్రీనివాస్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు గాజుల శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News