ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నాయకులు కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాలను తీర్చి నప్పుడే వారి మెప్పు పొందుతారని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. ఆదివారం దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం మున్సిపాలిటీలోని కె ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అన్నారు. అంతేకాకుండా నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసినప్పుడే వారికి మళ్లీ భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకువచ్చినట్లైతే వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. ఎవరైనా నాయకులు గాని కార్యకర్తలు గాని అతి తెలివితేటలు ప్రదర్శిస్తే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అనంతరం పలు విషయాలపై సలహాలు సూచనలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు , ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News