Monday, 14 September 2026 01:03:52 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ప్రథమ శ్రేణిలో రాణించాలి..

జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాసమల్ల

Date : 10 April 2026 12:42 AM Views : 205

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థులు శ్రద్ధగా చదువుకున్నని భవిష్యత్తులో రాణించి గురువులతో పాటు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని, అలాగే విద్యార్థులు చెడువాలు అలవాట్లకు బానిసలు కావద్దని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జ్ సాయికిరణ్ కాసమల్ల తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదువు చెప్పిస్తారని వారి ఆశలను వమ్ము చేయకుండా శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి తీసిపోకుండా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి విద్యను అందించడంతోపాటు పౌష్టికాహారాన్ని కూడా అందజేయడం మీ అదృష్టం అన్నారు. అంతేకాకుండా మీ యొక్క బోధకులు కూడా చాలా మంచిగా విద్యను అందిస్తున్నారని వారు చెప్పిన విద్యను సద్వినియోగం చేసుకున్నట్లయితే నీ జీవితం సుఖాంతం అవుతుందన్నారు. చదువుకునే దశలో ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా 30 సంవత్సరాలు కష్టపడి చదివినట్లయితే 80 సంవత్సరాలు సుఖంగా ఉంటారని తెలిపారు. గంజాయి, ధూమపానం,గుట్కా, అంబర్,మద్యం,తదితర వాటికి బానిస కావద్దన్నారు. ఎవరైనా ప్రేరేపించిన వారిని కట్టడి చేయాలన్నారు. అనంతరం పలు చట్టాలపై విద్యార్థులకు న్యాయవాదులు అవగాహన కల్పించారు. అవగాహన సదస్సులు ప్రిన్సిపల్ సిహెచ్. మంగ, ఏటీపీ తిరుమల్, ఏ జి పి పద్మ, న్యాయవాదులు రాజేశ్వరరావు, సత్యనారాయణ, కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, న్యాయవాదులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :