ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థులు శ్రద్ధగా చదువుకున్నని భవిష్యత్తులో రాణించి గురువులతో పాటు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని, అలాగే విద్యార్థులు చెడువాలు అలవాట్లకు బానిసలు కావద్దని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జ్ సాయికిరణ్ కాసమల్ల తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదువు చెప్పిస్తారని వారి ఆశలను వమ్ము చేయకుండా శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి తీసిపోకుండా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి విద్యను అందించడంతోపాటు పౌష్టికాహారాన్ని కూడా అందజేయడం మీ అదృష్టం అన్నారు. అంతేకాకుండా మీ యొక్క బోధకులు కూడా చాలా మంచిగా విద్యను అందిస్తున్నారని వారు చెప్పిన విద్యను సద్వినియోగం చేసుకున్నట్లయితే నీ జీవితం సుఖాంతం అవుతుందన్నారు. చదువుకునే దశలో ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా 30 సంవత్సరాలు కష్టపడి చదివినట్లయితే 80 సంవత్సరాలు సుఖంగా ఉంటారని తెలిపారు. గంజాయి, ధూమపానం,గుట్కా, అంబర్,మద్యం,తదితర వాటికి బానిస కావద్దన్నారు. ఎవరైనా ప్రేరేపించిన వారిని కట్టడి చేయాలన్నారు. అనంతరం పలు చట్టాలపై విద్యార్థులకు న్యాయవాదులు అవగాహన కల్పించారు. అవగాహన సదస్సులు ప్రిన్సిపల్ సిహెచ్. మంగ, ఏటీపీ తిరుమల్, ఏ జి పి పద్మ, న్యాయవాదులు రాజేశ్వరరావు, సత్యనారాయణ, కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, న్యాయవాదులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News