Tuesday, 28 July 2026 10:19:54 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ప్రథమ శ్రేణిలో రాణించాలి..

జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాసమల్ల

Date : 10 April 2026 12:42 AM Views : 172

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థులు శ్రద్ధగా చదువుకున్నని భవిష్యత్తులో రాణించి గురువులతో పాటు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని, అలాగే విద్యార్థులు చెడువాలు అలవాట్లకు బానిసలు కావద్దని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జ్ సాయికిరణ్ కాసమల్ల తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదువు చెప్పిస్తారని వారి ఆశలను వమ్ము చేయకుండా శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో రాణించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి తీసిపోకుండా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి విద్యను అందించడంతోపాటు పౌష్టికాహారాన్ని కూడా అందజేయడం మీ అదృష్టం అన్నారు. అంతేకాకుండా మీ యొక్క బోధకులు కూడా చాలా మంచిగా విద్యను అందిస్తున్నారని వారు చెప్పిన విద్యను సద్వినియోగం చేసుకున్నట్లయితే నీ జీవితం సుఖాంతం అవుతుందన్నారు. చదువుకునే దశలో ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా 30 సంవత్సరాలు కష్టపడి చదివినట్లయితే 80 సంవత్సరాలు సుఖంగా ఉంటారని తెలిపారు. గంజాయి, ధూమపానం,గుట్కా, అంబర్,మద్యం,తదితర వాటికి బానిస కావద్దన్నారు. ఎవరైనా ప్రేరేపించిన వారిని కట్టడి చేయాలన్నారు. అనంతరం పలు చట్టాలపై విద్యార్థులకు న్యాయవాదులు అవగాహన కల్పించారు. అవగాహన సదస్సులు ప్రిన్సిపల్ సిహెచ్. మంగ, ఏటీపీ తిరుమల్, ఏ జి పి పద్మ, న్యాయవాదులు రాజేశ్వరరావు, సత్యనారాయణ, కారుకూరి సురేందర్, అక్కల శ్రీధర్, న్యాయవాదులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :