ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బాధిత కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పోలీసు సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హామీ ఇచ్చారు. శనివారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నందు, జూన్ నెలలో ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎం నాగేశ్వరరావు అనారోగ్యంతో మరణించాడు అన్నారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులైన భార్య ఎం అనసూయ, కుమారుడు ఎం చందు లను పోలీసు ముఖ్య కార్యాలయానికి ఆహ్వానించి, వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ద్వారా కార్పస్ ఫండ్ లో వచ్చిన లక్ష రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎలాంటి సందర్భంలోనైనా జిల్లా పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉంటే సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. మిగిలిన ప్రభుత్వ ద్వారా వచ్చే లబ్ధి త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వచ్చిన డబ్బును అక్రమశిక్షణతో వాడుకోవాలని సూచిస్తూ ఎలాంటి పరిస్థితుల్లో నైనా పోలీసు సహాయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బి సురేందర్ రావు, పోలీసు కార్యాలయం సూపర్డెంట్ సులోచన, సిబ్బంది దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News