ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 'హనీ 7 బార్ అండ్ రెస్టారెంట్' గురువారం ఘనంగా పునః ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు వంటికొమ్ము యుగంధర్, గుడిపూడి నవీన్ రావ్, కుడితి మహేందర్ రెడ్డి, గుగులోతు వెంకన్న, గుగులోతు రాంబాబు, గుండాగాని వేణు, పానుగోతు రాంలాల్, గుండాగాని వెంకన్న, మార్కండేయ రమేష్ హాజరై పునః ప్రారంభం అవుతున్నా హాని సేవన్ బార్ అండ్ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ప్రజలకు మరియు ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు అందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని పునః ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. యాజమాన్యం మాట్లాడుతూ, తమ హాని సేవన్ బార్ అండ్ రెస్టారెంట్లో రుచికరమైన వంటకాలతో పాటు కస్టమర్ల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో స్థానిక నాయకులు, వ్యాపార ప్రముఖులు మరియు రెస్టారెంట్ యాజమాన్యం. అభిమానులు, స్థానికులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
E Nivas News