Wednesday, 29 July 2026 12:13:14 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఒక్క అవకాశం ఇవ్వండి ఎల్లప్పుడూ సేవకురాలిగా ఉంటా..! చేతి గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలి

10వ వార్డు ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ శ్రేణుల ముమ్మరంగా ప్రచారం

Date : 02 February 2026 07:09 PM Views : 182

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : తనకు కౌన్సిలర్ గా ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. సేవకురాలిగా ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి బానోత్ పార్వతీ చిన్నా నాయక్ అన్నారు. సోమవారం ఆమె మరిపెడ మున్సిపాలిటీ లోని 10వ వార్డులోని మరిపెడ ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముమ్మరంగా ఇంటింటా ప్రచారం నిర్వహించి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పార్వతీ చిన్నా మాట్లాడుతూ.. కాంగ్రెస్ తోనే మరిపెడ మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ వల్లనే వార్డు అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, 200ల యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, ఉచిత బస్ ప్రయాణం ప్రవేశపెట్టి మహిళా అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ సహకారంతో వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అమృనాయక్ ఇదయ, రామస్వామి, చంద్రయ్య, ఆటో రాములు, యూత్ అధ్యక్షులు రంజిత్, గుగులోత్ మోహన్, ఇస్లావత్ రమేష్, సందీప్, శ్రీకాంత్,బానోత్ నరేష్, గూగులోత్ బాధ, బానోత్ మల్సూర్, బానోతు ఏరియా, బానోతు సుక్య, భూక్య నాగ, ఎస్సీ కాలనీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :