Saturday, 13 June 2026 02:26:37 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఒక్క అవకాశం ఇవ్వండి ఎల్లప్పుడూ సేవకురాలిగా ఉంటా..! చేతి గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలి

10వ వార్డు ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ శ్రేణుల ముమ్మరంగా ప్రచారం

Date : 02 February 2026 07:09 PM Views : 151

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : తనకు కౌన్సిలర్ గా ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. సేవకురాలిగా ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి బానోత్ పార్వతీ చిన్నా నాయక్ అన్నారు. సోమవారం ఆమె మరిపెడ మున్సిపాలిటీ లోని 10వ వార్డులోని మరిపెడ ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముమ్మరంగా ఇంటింటా ప్రచారం నిర్వహించి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పార్వతీ చిన్నా మాట్లాడుతూ.. కాంగ్రెస్ తోనే మరిపెడ మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ వల్లనే వార్డు అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, 200ల యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, ఉచిత బస్ ప్రయాణం ప్రవేశపెట్టి మహిళా అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ సహకారంతో వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అమృనాయక్ ఇదయ, రామస్వామి, చంద్రయ్య, ఆటో రాములు, యూత్ అధ్యక్షులు రంజిత్, గుగులోత్ మోహన్, ఇస్లావత్ రమేష్, సందీప్, శ్రీకాంత్,బానోత్ నరేష్, గూగులోత్ బాధ, బానోత్ మల్సూర్, బానోతు ఏరియా, బానోతు సుక్య, భూక్య నాగ, ఎస్సీ కాలనీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :