ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకుని భవిష్యత్తులో రాణించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. సోమవారం మంచిర్యాల జిల్లా లక్షెటిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో ఆశపెట్టుకొని పిల్లలను చదివిస్తారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువుకున్నట్లయితే వారి భవిష్యత్తులో రాణించడంతోపాటు నేర్పిన గురువులతోపాటు తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు తెచ్చిన వారవుతారన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంశంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి చదవాలని ఇతర అంశాలపై దృష్టి పెట్టినట్లయితే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని ఆయన సూచించారు. దినదినం పోటీ ప్రపంచంలో ప్రతి విషయంలో పోటీ ఎక్కువ అవుతుందని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసమే ఆలోచించి తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలన్నారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడి విద్య నేర్పిస్తున్నారు ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నట్లైతే తప్పకుండా విజయాన్ని సాధించిన వారవుతారు అన్నారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ ఉపాధ్యాయ సిబ్బంది స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News