Saturday, 12 September 2026 09:31:11 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఆర్టీసీ యాజమాన్యంకు ఈ .వి ఆటోలను ఇవ్వాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహారించుకోవాలి...

ఆటో కార్మికుల నిరవధిక బందు కు సిఐటియు సంపూర్ణ మద్దతు.. సీఐటీయు జిల్లా కార్యదర్శి

Date : 22 August 2026 08:58 PM Views : 75

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆర్టీసీ యాజమాన్యం ఇవి ఆటోలను ఇవ్వాలి అనే ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం సిఐటియు ఆధ్వర్యంలో ఐబి చౌరస్తా లో ఉన్న ఆటో కార్మికులు, ఆటో జేఏసీ నాయకులతో మాట్లాడటం జరిగిందన్నారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీ తర్వాత ఆటో రంగమే లక్షలాది మందికి రవాణా సౌకర్యం కల్పిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధి కోసం ప్రభుత్వాలపై ఆధారపడకుండా జీవనోపాధి కోసం అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని ఈ రోజు ప్రతి మారుమూల గ్రామాల, పట్టణ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ లక్షలాది మంది ఆటోల ద్వారా జీవనోపాధి పొందుతూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నా రన్నారు.ఇలా రోజువారిగా ప్రజలకు సౌకర్యం కల్పిస్తున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికి నేటి వరకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సం,, 12వేలు ఇవ్వాలి. నేటికి 2 ఏండ్లు గడిచిన అమలు చేయలేదని ఆరోపించారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయటం వలన యాక్సిడెంటల్గా ఆటో డ్రైవర్ చనిపోయినా వారి కుటుంబానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఆటో కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే లేదా ఆ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏలాంటి సహాయ సహకారాలు లేవు. ఆటో డ్రైవర్లు కేవలం వారి జీవనభృతి కోసం కాకుండా రాష్ట్ర ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ ప్రజలు ఇచ్చిన డబ్బులతోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయటం వలన ఆటో, క్యాబ్, లారీ, డిసిఎం లాంటి మోటార్ కార్మికులకు చాలా ఉపయోగం ఉంటుంది. ఈ సంక్షేమ బోర్డు వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఏలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు. వాస్తవంగా సంక్షేమ బోర్డుకు ఆటోలు కొన్నా, క్యాబ్లు కొన్నా, లారీలు కొన్నా, డిసిఎంలు కొన్నా అనేకమైన వాహనాలపై కొత్తగా కొనుగోలు చేసే సందర్భంలో 2% సెస్సు కనుక వసూలు చేసినట్లయితే కోట్లాది రూపాయలు ఈ సంక్షేమ బోర్డుకు నిధులు వస్తాయి. అదే విధంగా కార్మికుల నుండి సభ్యత్వ రుసుము వసూలు చేసి నమోదు చేసి లక్షలాది మంది సభ్యులుగా చేర్చు కోవచ్చన్నారు. ఈ సంక్షేమ బోర్డు వలన రవాణ రంగంలో ఉన్న కార్మికులందరికి భరోసాగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ బోర్డును త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. ఓలా, ఊబర్, రాపిడో యాప్ల ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్లను అవసరమైన మేరకు యాప్ల వారు ఇష్టం వచ్చినట్లు కమీషన్లు దండుకుంటున్నారు. ప్రభుత్వమే ఒక యాప్ను తీసుకురావాలన్నారు. ఆర్టీసీయాజమాన్యానికి రాష్ట్రంలో నడుస్తున్న ఈ.వి. ఆటోలను ఏర్పాటు చేయటం ఆటో డ్రైవర్ల పొట్టకొట్టటమే అవుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం పెట్టటం వలన వేలాది మంది ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోవటం జరిగింది. ఆర్టీసీకి అవసరం అనుకుంటే ఇప్పుడున్న ఆటో డ్రైవర్ల వద్ద ఉన్న ఈ.వి. ఆటోలను తీసుకొని ప్రజారవాణా కోసం ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. దీని వలన చాలా మందికి ఆటో డ్రైవర్లకు ఆన్యాయం చేసినవారు అవు తార అన్నారు. కావున వెంటనే ఆర్టీసీ ఈ.వి. ఆటోల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవా లన్నారు. అదే విధంగా ఈ క్రింది తెలిపిన సమస్యల పరిష్కారం కోసం 2026 ఆగస్టు 23 అర్ధరాత్రి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ఆటో డ్రైవర్ల నిరవధిక బంద్ లో కార్మికులు, ప్రజాస్వామిక వాదులు,విద్యార్థులు, యువత, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు అందరూ సహకరించగలరని జయప్రదం చేయాలన్నరు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: