ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుళ్లకోట గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు చేసిన అప్పులు ఈఎంఐల, బాధ భరించలేక జీవితం మీద విరక్తితో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్, తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చితికిపోయి జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు తన చావుకు ఎవరు బాధ్యులు కాదని కేవలం తాను చేసిన అప్పుల బాధతో చనిపోతున్నట్లు ఆయన లేఖ రాశారు. తెలిసే తెలివకు తొందరపడి అప్పులు చేశానని చివరికి తన కుటుంబం గుర్తు వచ్చేసరికి తను చాలా తప్పు చేశానని అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తన కుటుంబ సభ్యులను ఆదుకోవాలని నాయకులతోపాటు స్నేహితులను కూడా లేఖలో కోరాడు. వృత్తి రీత్యా ఆర్ఎంపి వైద్యుడైన జగన్ గ్రామంలో ప్రజలకు వైద్య సేవలు అందించేవాడు. గ్రామంలో తన కుటుంబానికి మంచి పేరు ఉంది.జగన్ వ్యక్తిత్వం గల మనిషి సేవ గుణం తో ప్రజల ఆదరణ పొందాడు దీంతో గ్రామస్తులు ఆయనను సర్పంచ్ గా గెలుపు గెలిపించారు. ఒక్కసారి సర్పంచ్ గా ఎన్నికైన జగన్ ఐదేళ్లపాటు ప్రజలకు సేవలు అందించడంతోపాటు అభివృద్ధి పథంలో నడిపాడు. అనంతరం బిఆర్ఎస్ పార్టీలో చేరి ఉమ్మడి వెల్గటూరు మండల కార్యదర్శిగా, ఎండపల్లి మండల అధ్యక్షుడిగా దశాబ్ది కాలంగా బిఆర్ఎస్ పార్టీకి సేవలు అందించాడు. జగన్ ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం తెలిసిన వెంటనే ఇటు బిఆర్ఎస్ నాయకులు అటు ప్రజలు వెంటనే ఆయన శవాన్ని చూడడానికి తరలివెళ్లి నివాళులర్పించారు. ప్రజలంతా మంచి మంచి మారుపేరుగా ఉన్న జగన్ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకోవడంతో భార్య} చిన్న పిల్లలు రోడ్డుపై పడ్డారని కుటుంబ సభ్యులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
E Nivas News