ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : గోదావరి హారతి ఉత్సవ సమితి మంథని ఆధ్వర్యంలో ఈనెల 3న నిర్వహించనున్న గోదావరి మహా హారతి కరపత్రాలు శుక్రవారం ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ, ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. మంథని పరిసర ప్రాంతాల ప్రజలు భక్తులు, హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని గోదావరి మాత ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్ గుప్తా, రావుల సతీష్, బత్తుల సత్యనారాయణ, మేడగొని రాజమౌళి గౌడ్, బోట్ల ఆంజనేయులు, గర్రెపల్లి వెంకటేశ్వర్లు, నామని నగేష్, బోయిని నారాయణ, నాంపల్లి రమేష్, మురళి, నారమల్ల కృష్ణ, వంగల తిరుమలేష్, ఇసంపెళ్లి కొమురయ్య, గుడ్ల గురువేష్, కొమరవెల్లి హరీష్, కుమ్మరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News