ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రాష్ట్రంలో రెండవ తెలంగాణ రాష్ట్రంలో అన్నవరం గా ప్రసిద్ధిగాంచిన శ్రీ సత్య దేవుడి ఆలయంలో ఈనెల 5న జరిగే కార్తీక పౌర్ణమి జాతరకు ఏర్పాటులు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తో పాటు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ సమీపంలోనూ పుణ్య గోదావరి ఉండడంతో ప్రతి ఒక్కరు గోదావరిలో స్నానాలు ఆచరించి కాలినడకన ఆలయానికి చేరుకొని మొదటగా దేవుడిని దర్శించుకుంటారు. కార్తీక పౌర్ణమిలో సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని ఉద్దేశంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తారు. ఈ జాతరను తొలగించడానికి తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుండి భక్తులు వేలాది సంఖ్యలో తరలివస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వచ్చిన భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. జాతర రోజున స్వామి వారిని దర్శించుకోవడానికి పెద్ద పెళ్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతోపాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు హాజరవుతారని తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచిర్యాల ఎసిపి ఆధ్వర్యంలో లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.
Admin
E Nivas News