ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ బుధవారంకేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, కేంద్ర పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నుమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైన సాగునీటి ప్రాజెక్టులు, జల వనరుల సమర్థ నిర్వహణ,పర్యావరణ అనుమతులు, అటవీ సంబంధిత అంశాలు, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో అమలు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాంతాల అవసరాలు, మౌలిక వసతుల కల్పన,కేంద్రసహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, రాష్ట్రప్రజలసంక్షేమానికి అవసరమైన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించాలని కేంద్ర మంత్రులను కోరారు.
Admin
E Nivas News