ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తదితర కేసుల్లో నీ బాధితులకు త్వరితవేత్తన ఎక్స్ప్రెస్ చెల్లించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ రేణి కుంట్ల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్,మంచిర్యాల డిసిపీ భాస్కర్ ఆధ్వర్యంలో ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసుల పురోగతి పై త్రైమాసిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేసీయాను త్వరగా ఇప్పించాలని అలాగే ఏస్సి, ఎస్టీ కేసుల ఫిర్యాదులను ఎలాంటి జాప్యం చేయకుండా కేస్ రిజిస్టర్ చేయాలని ఆదేశించారు. ఇటీవల దండేపల్లి మండలం గూడెం నంభాలలో అత్యాచారానికి గురై హత్య కాబడిన బాలిక కుటుంబ సభ్యులకు 10రోజుల్లో పరిహారం ఇవ్వడానికి కలెక్టర్ అంగీకారం తెలియజేశారు .బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ డీఎస్డీవోదుర్గాప్రసాద్ ,పోలీస్ అధికారులు, జిల్లా సంబంధిత అధికారులు, మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Admin
E Nivas News