ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. చిన్న కాలేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణపై శుక్రవారం విచారణ చేపట్టారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతల పథకంలో భాగంగా గారేపల్లి రిజర్వాయర్ కింద చిదినేపల్లి పంచాయతీకి సంబంధించి భూ సేకరణపై ఎంక్వయిరీ సమావేశం నిర్వహించారు. ఈ విచారణలో భూ నిర్వాసితులు వారి సమస్యలను అధికారులకు తెలియ జేసిన స్థానిక సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు ఎకరాకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని అధికారులకు విన్నవించారు.భూ నిర్వాసితులకు ఎకరానికి ప్రభుత్వం నుండి వచ్చే పది లక్షల 50 వేలు కాకుం డా నష్టపరిహారం ఎకరాకు 25 లక్షల రూపాయలు పెంచాలని లేకపోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అలాగే గ్రామంలో రి సర్వే చేపించి అర్హులైన భూ నిర్వాసితులకు పరిహారం అందించాలని. గ్రామ పంచాయతీ గ్రామ సభకు మొదటిసారి వచ్చిన సందర్భంగా కాటా రం తహసీల్దార్ నాగరాజుకు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, అధికారులు, గిర్ధవర్, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రతాపగిరి గ్రామ సర్పంచ్ వూర వెంక టే శ్వరరావు. చిదినేపల్లి ఉప సర్పంచ్ కొర్రాళ్ళ రాజ య్య, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, ప్రజలు రైతులు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
Admin
E Nivas News