ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో ఏసీబీ అదికారులు అవినీతి అధికారల ఆట కట్టిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు గురువారం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు కోసం నీటిపారుదల శాఖ నుంచి నిరభ్యంతర పత్రం ( ఎన్ఓసి) కోసం దరఖాస్తుచేసుకున్నాడు. కాగా ఎన్వోసీ ఇవ్వడానికి నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజినీర్ రమేశ్లు బాధితుడిని రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం డబ్బులు బాధితుడు బతిమిలాడడంతో చివరకు 60,000, ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది ఇక లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు అవినీతి నిరోధక శాఖఅధికారుల ను ఆశ్రయించాడు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో దాడిచేశారు.ఆదిలాబాద్లోని నీటిపారుదల శాఖకార్యాలయంలోనే బాధితుడి నుంచి ఈఈ విఠల్, ఏఈ రమేశ్ రూ.60 వేల నగదుతీసుకుంటుండగా అధికారులు మెరుపుదాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రికార్డులను పరిశీలిస్తున్నారు.
Admin
E Nivas News