Tuesday, 28 July 2026 11:38:26 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

15 న జోడేఘాట్ నుండి సిపిఐ 100 సంవత్సరాల ముగింపు సభ జాత ప్రారంభం...

Date : 13 November 2025 08:26 PM Views : 249

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : నవంబర్ 15 జూడేఘాట్ నుండి సిపిఐ 100 సంవత్సరాల ముగింపు జాతర ప్రారంభిస్తామని రామడుగు లక్ష్మణ్ తెలిపారు. గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భాషెట్టి బంగారం విజ్ఞాన్ భవన్ లో భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్యాయంలో కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాల ముగింపు భారీ బహిరంగ సభ డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు అన్ని రాష్ట్రాలతో పాటు 40 దేశాలకు సంబంధించి ప్రతినిధులు పాల్గొంటారని, ముగింపు సభ సందర్భంగా రాష్ట్రంలో మూడు జాతాలు నిర్వహించడం జరుగుతుందని, ఈనెల 15 నుండి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ నుండి బస్సు జాతర ప్రారంభమవుతుందన్నారు. ఈ జాతరకుమాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి , సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేనా శంకర్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కే మణికంఠ రెడ్డి నాయకత్వం వహిస్తారని వీరితోపాటు ప్రజానాట్యమండలి సభ్యులు జాతలో పాల్గొంటారని, మరియు సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా మూడు నియోజకవర్గాల నుండి 100 బైకులు ఈ జాతాలో పాల్గొంటారని, ఈ జాత ఈనెల 15 వ తేదీన ఉదయం 11 గంటలకు జోడేఘాట్ లో మొదలై, ఆసిఫాబాద్, రెబ్బెన, తాండూర్, బెల్లంపల్లి, సోమగగూడెం, మందమర్రి, రామకృష్ణాపూర్, మంచిర్యాల సాయంత్రం 6:30 నిమిషాలకు ముగుస్తుం దన్నారు. అలాగే జాతర కొనసాగుతూ ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి హనుమకొండ, వరంగల్, మహబూబాద్, 21న భద్రాచలంలో ముగుస్తుందని ఈ జాతలో పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు, కర్షకులు, అశేష ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి మాట్లాడుతూ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జోడేఘాట్ నుండి మొదలయ్యే ఈ జాతను అన్ని వర్గాల ప్రజలు ఆదరించి జయప్రదం చేయాలని, పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యకర్తలు మరియు అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజం, పట్టణ కార్యవర్గ సభ్యులు బొంకూరి రామచందర్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :