ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని ఆర్టీసీ బస్సు డిపో ఉద్యోగులు 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని బస్సు డిపో ఆవరణలో ఉద్యోగులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి భారత రాజ్యాంగ నిర్మాణ ఆమోద దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరిండెంట్ సుజాత, మెకానికల్ సూపరిండెంట్ ఇక్బాల్, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ సాగర్ రెడ్డి, ఎడిసి ఐలయ్య, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు శనిగరపు సదయ్య, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Admin
E Nivas News