ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గ్రంథాలయాలు విజ్ఞానానికి ఎంతగానో దోహదపడతాయని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. బుధవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీలోని కాపువాడ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఎంపీ గోడం నగేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ స్థానిక కౌన్సిలర్ ఎమ్మాజీ శారద సంతోష్ లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు సమాజ వికాసానికి, విజ్ఞాన విస్తరణకు కేంద్ర బిందువులనిపేర్కొన్నారు. యువతలో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు విద్యార్థులు పోటీ పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధమయ్యేందుకు ఈ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News