Tuesday, 28 July 2026 08:28:34 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

గ్రంథాలయాలు విజ్ఞానానికి ఎంతగానో ఉపయోగపడతాయి...

Date : 08 July 2026 11:19 PM Views : 78

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గ్రంథాలయాలు విజ్ఞానానికి ఎంతగానో దోహదపడతాయని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. బుధవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోని కాపువాడ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఎంపీ గోడం నగేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ స్థానిక కౌన్సిలర్ ఎమ్మాజీ శారద సంతోష్ లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు సమాజ వికాసానికి, విజ్ఞాన విస్తరణకు కేంద్ర బిందువులనిపేర్కొన్నారు. యువతలో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు విద్యార్థులు పోటీ పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధమయ్యేందుకు ఈ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :