ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నూకల రమేష్ కోరారు. సోమవారం మంచిర్యాల కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖఆదేశాల మేరకు మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని నస్పూర్ ఎం. ఎం. గార్డెన్ లో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 2,26,27,28 డివిజన్ల పోటీ చేసే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. టీపీసీసీ సభ్యులు, నస్పూర్ ఇంఛార్జి నూకల రమేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో కార్పొరేషన్ మరింత అభివృద్ధి చేయాలంటే నిధులు అవసరమని మనకు కావాల్సిన నిధులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఎవరిని రకాలు మభ్యపెట్టిన ఎవరు కూడా భయపడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News