ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పర్యవేక్షకులు మరియు ఘనకర్తలు వారికి కేటాయించబడిన హెల్ బీ బ్లాకులను మున్సిపల్ అధికారులతో కలిసి సోమవారంముందస్తుగా సందర్శించారు. తమకు కేటాయించిన బ్లాకులను హద్దులను పరిశీలించి, మ్యాప్ మ్యాప్ డ్రాయింగ్ చేసుకోవాల్సినదిగా సూపర్వైజర్లు ఎన్యూమరేటర్లకు చూపించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అడిషనల్ చార్జ్ ఆఫీసర్ రాజశేఖర్ వారికి తగు సూచనలు ఇచ్చారు.ఈ మూడు రోజుల్లో ప్రతి ఇల్లు మ్యాపింగ్ చేయవలసినదిగా కోరినారు. సూపర్వైజర్ల సమక్షంలో మీ యొక్క హెలబీ లనుసతనిఖీ చేసుకొని ఏమైనా సర్దుబాట్లు ఉంటే సరి చేసుకోవాలని తెలిపారు. మునిసిపాలిటీ పరిధి లోని ప్రజలందరూ మీ వద్దకు గృహ గణన చేయాడానికి వస్తున్న ఎన్యూరేటర్లకు మీరు వారు అడిగిన ప్రశ్నలకు సమాచారం ఇచ్చి వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుల తిరుపతి, సూపర్వైజర్లు రామన్న, సత్తయ్య, రజిత, రవీందర్, వేణు గోపాల్ , ధిలీప్, నగధర్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
Admin
E Nivas News