ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పార్లమెంట్లో ప్రజా సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులపై లాఠీచార్జ్, గ్యాస్ ప్రయోగం, కాల్పుల ఘటనలకు సంబంధించి అమిత్ షా పార్లమెంట్కు వచ్చి వివరణ ఇవ్వాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు. 20 రోజులుగా ఇదే ప్రశ్న అడుగుతున్నామని, అయినా కేంద్ర హోంమంత్రి సభకు వచ్చి సమాధానం చెప్పడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోవడం వల్ల సుమారు రూ.250 కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని వంశీకృష్ణ పేర్కొన్నారు. ప్రజల పన్నులతో నడిచే పార్లమెంట్ సమయాన్ని వృథా చేయకుండా, వెంటనే సభకు వచ్చి జరిగిన ఘటనలపై సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.అమిత్ షా పార్లమెంట్కు రావాలి.. ప్రజలకు, దేశానికి జవాబు చెప్పాలి. విద్యార్థులపై జరిగిన ఘటనలకు బాధ్యత వహించాలి”* అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ప్రజల తరఫున పార్లమెంట్లో తమ పోరాటం కొనసాగుతుందని, బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
Admin
E Nivas News