ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : భగవాన్ శ్రీ సత్య సాయిబాబా భక్తులకు చూపిన మార్గం ఆనందదాయకమని, ప్రతి ఒక్కరూ ప్రేమతో జీవించాలని ఆయన కోరుకునే వారని మంథని సత్య సాయిబాబా సేవా ట్రస్ట్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ గంగా రాధా కిషన్ అన్నారు. ఆదివారం శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ముగింపు సందర్భంగా సంగీత విభావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా శతా బాబా శత జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందం ఇచ్చిందన్నారు. సంగీత సంగీత విభావరి కార్యక్రమంలో గాయకులుగా మహావాది సుధీర్, విజయ్ సోదరులు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే చివరి రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, నిరుపేదలకు దుస్తులు, మందులు అంద చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండా శంకర్, అష్టదని గంగాధర్, రామడుగు మారుతి, మేడగోని రాజమౌళి గౌడ్, యజ్ఞంభట్ల లక్ష్మీరాజం, నల్లగొండ శ్రీనివాస్, అవధానుల శ్రీనివాస్, రామడుగు శ్రీనివాస్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News