Friday, 11 September 2026 07:39:44 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

Date : 10 September 2026 07:49 PM Views : 58

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు లోని, సిపిఎం పార్టీ కార్యాలయంలో వీరనారి చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి.రామకృష్ణుడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ వెట్టి చాకిరి విముక్తి కుల నిర్మూలన పీడిత వర్గ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని. అందరూ జీవించేందుకు ఉపాధి కోసం ప్రజలందరికీ భూమి కావాలని పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువతరం సమాజంలోని ఆర్థిక అసమాన తల నిర్మూలన కొరకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు వి.రామకృష్ణ , కార్యదర్శి చందా వారి వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు సి.ధర్మయ్య లు విజ్ఞప్తి చేశారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నందు రజక వీరనారి చిట్యాల ఐలమ్మ 41వ మరియు అమరజీవి సత్తెనపల్లి రామకృష్ణ 26వ వర్ధంతి సభ జిల్లా నాయకులు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పీడిత ప్రజలందరినీ సమైక్యపరిచి హీరోచిత పోరాటం నిర్వహించిందని ఆ పోరాట ఫలితంగా మన దేశంలోనే ఒక చరిత్ర సృష్టించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల భూమి బడుగు బలహీన వర్గాలకు పంచిన పోరాటంగా నిలిచిందని ఆయన అన్నారు. అలాగే 2000 సంవత్సరములో పేద ప్రజల పైన అప్పటి పాలకులు పెంచి అమలు జరిపిన విద్యుత్తు సంస్కరణలు కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పేద ప్రజల వైపు నిలిచి ప్రాణాలర్పించిన వేగుచుక్క సత్తెనపల్లి రామకృష్ణ కి జోహార్లు అర్పిస్తున్నామని రానున్న రోజుల్లో కుల వివక్షత లేని సమాజం కోసం - మన పాలకులు ప్రజల పైన మోపుతున్న విద్యుత్ భారాలు కు వ్యతిరేకంగా పోరాటమే చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ లకు నిజమైన నివాళి అని ఆయన అన్నారు. చిట్యాల ఐలమ్మ రామకృష్ణ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఎక్కడ రజకులకు అన్యాయం జరిగిన నిలబడి పోరాడే సంఘం అని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రజకుల వైపు నిలబడి పోరాటం చేద్దామని వారు చెప్పారు. పోరాట యోధురాలు & వీరనారి చిట్యాల ఐలమ్మ మరియు అమరజీవి సత్తెనపల్లి రామకృష్ణ లకు చిత్రపటాలకు పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు టి.వెంకటేశ్వరరావు, వెంకటరమణ, శివన్న మధు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :