Friday, 31 July 2026 12:06:34 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు

వెలుగోడు మండలంలోని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పేద టెన్త్ టాఫర్స్ విద్యార్థులకు ఘన సన్మానం

Date : 30 July 2026 09:54 PM Views : 9

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : పేద విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో "విద్యార్థి ప్రోత్సాహక అభినందన సభ" గురువారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందు పాఠశాల ఆవరణలోని సరస్వతి, ఫాతిమాబీ, మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలో, విద్యాబుద్ధులు నేర్పిన కీర్తిశేషులైన గురువులు మరియు విద్యార్థుల స్మృతికి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ప్రతిభను గుర్తించి ప్రభుత్వ, ప్రైవేట్ టాపర్స్ సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల 10వ తరగతి టాపర్స్‌కు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, మెమొంటోలు చేతికి అందించి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభ చాటిన పేద విద్యార్థులకు మొత్తం రూ.1లక్ష, 35 వేల నగదు ప్రోత్సాహకం స్కాలర్షిప్‌లు అందజేశారు. ఇందులో 15 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6000, 6 మందికి రూ.5000 చొప్పున, మూడు వేల రూపాయల చొప్పున ఒకరికి, 6 మందికి రూ.1500 చొప్పున, ఒకరికి రూ.1000/- చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నం సుధాకర్ రెడ్డి దంపతులకు, సిఎ పూర్తి చేసిన తాళ్లూరి శ్యామ్‌కు పూర్వ విద్యార్థుల సంఘం ఘనంగా సన్మానం చేసింది. పేద విద్యార్థులకు చేయూతనిచ్చిన పూర్వ విద్యార్థుల సంఘం సేవలను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, పూర్వ విద్యార్థుల సంఘం అందిస్తున్న ప్రోత్సాహం ఇతరులకు ఆదర్శమని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పూర్వ విద్యార్థుల సేవలు మన వెలుగోడు పట్టణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఉండడం మనందరి అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మాలిక్ ఖాన్, ఇన్చార్జి హెచ్ఎం మొయినుద్దీన్, మాజీ సర్పంచ్ వేల్పుల జయపాల్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు జి.రామలింగారెడ్డి, మక్బుల్ బాషా, వై.సుధాకర్ రెడ్డి, జయరామిరెడ్డి, నసురుల్లా ఖాన్, శ్రీకాంత్ రెడ్డి, సుల్తాన్ మొహిద్దిన్, జె.రఫిక్ అహ్మద్, నారాయణ, శ్రీరాములు, ప్రభుత్వ -ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, హెచ్ఎంలు డాక్టర్ ఎంఎఫ్. ఇమ్మానియేల్, అతావుల్లా, నరసింహులు, తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :