ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు అసెంబ్లీ సంస్థాగత బి ఎల్ ఏ 2 సమావేశం అల్వాల ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించబడినది. పాములపాడు మండలం బిజెపి అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ అధ్యక్షతన ఈ సమావేశానికి పాములపాడు మండలంలోని, వివిధ గ్రామాల బూత్ ఏజెంట్స్ హాజరు కావడం జరిగింది. అలాగే పాములపాడు మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రుద్రవరం గ్రామానికి చెందిన 50 మందిపైగా యువకులు బిజెపిలోకి చేరారు. ఈ కార్యక్రమం నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జ్ బిఎల్ఏ 1 దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు, నంద్యాల జిల్లా బిజెపి ఇన్చార్జి పార్థసారధి, కో ఇన్చార్జి కాశీ విశ్వనాథ్, నంద్యాల జిల్లా సర్ కన్వీనర్ నిమ్మకాయల సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భముగా జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు గాను, ప్రెసిడెంట్లు గాను, ఎంపీటీసీలుగా, జడ్పిటిసిలుగా వార్డు మెంబర్లుగా అన్ని పార్టీలతో సమానంగా మనం ఉండాలని తెలియజేశారు. నంద్యాల ఇన్చార్జి పార్థసారధి మాట్లాడుతూ సంస్థానతపరంగా సరల్ యాప్ ఎక్కిస్తూ క్రమ పద్ధతితో ఉంటేనే పార్టీ గుర్తిస్తుందని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ప్రతినెలా సక్రమంగా జరగాలని అందరూ కలిసి పనిచేయాలని పార్థసారథి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాములపాడు మండల బిజెపి ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణయ్య, గ్రామ నాయకులు శివకుమార్, వెంకటరమణ, రామకృష్ణ, సూర్యం, వెంకటేశ్వర్లు, మల్లికార్జున, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News