ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : రెండేళ్ల కూటమిపాలనలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందడుగు వేసిందని టిడిపి బీసీ సెల్ పాములపాడు మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్ పిలుపునిచ్చారు. పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ రెండేళ్ల పాలనలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు గురించి డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా మండల బీసీ సెల్ అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్, యూనిట్ ఇంచార్జ్ ఎస్.ఆదిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత ఉపాధ్యక్షుడు కంభం విక్రమ్ గౌడ్, 250 బూత్ నందు కన్వీనర్, చిన్న దర్గయ్య, విబిజి రాంజీ పథకం సిబ్బంది చంద్రశేఖర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు , ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శంకరాములు నాయక్, టి.శివ గౌడ్, ఆర్.మహానంది, మోహన్ రావు, పక్కిరయ్య, వి.సుబ్బయ్య, హుస్సేన్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News