ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నేడు పాములపాడు మండలంలోని, మద్దూరు పంచాయితీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "ఇంటింటికి కూటమి ప్రభుత్వం" కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నాయకులతో, అధికారులతో కలిసి ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని, కరపత్రాలు పంచుతూ కూటమి ప్రభుత్వం-2 ఏళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించటమైనది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రజల వద్దకు వెళ్లి జవాబుదారీతనంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యక్తం చేస్తున్న విశ్వాసం మరింత బాధ్యతను పెంచుతోందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల విషయాన్ని ఇప్పటికే ఐటి & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే నిధులు విడుదలై అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం అన్నారు సూపర్ సిక్స్ హామీల అమలుతో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. తల్లికి వందనం, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువస్తున్నామని ప్రజలకు వివరించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. కూటమి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం, సహకారం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, ఎస్సై పి.తిరుపాలు, వైద్య ఆరోగ్యశాఖ సిహెచ్ఓ రేణుకాదేవి, టిడిపి మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, మండల నాయకులు మద్దూరు తిమ్మారెడ్డి, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, ఎర్రగుడూరు హరినాథ్ రెడ్డి, భానుముక్కల బండ్లమూరి వెంకటేశ్వరరావు, ఇస్కాల నాగలక్ష్మి రెడ్డి, చెలిమిళ్ళ ఆదినారాయణ, ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దూరు పెద్దన్న, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ రవీంద్ర, పాములపాడు మండల పరిధిలోని కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది
Admin
E Nivas News