ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : అనారోగ్య సమస్యలతో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య చొరవ తీసుకొని, తన కార్యాలయానికి వచ్చిన సీఎంఆర్ఎఫ్ అర్జీలను స్వయంగా పరిశీలించి ప్రత్యేక సాయం అందేలా చూశారు. నేడు పాములపాడు ఎంపీడీవో కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ & టిడిపి గ్రామ అధ్యక్షురాలు టేకూరి.రామసుబ్బమ్మ, తదితర నాయకులు, అధికారులతో కలిసి పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన సుప్రజ కి రూ. 17,150/-, జూటూరు గ్రామానికి చెందిన సుబ్బన్న కి రూ.35,534/-, కృష్ణనగర్ గ్రామానికి చెందిన దుర్గా రెడ్డి కి 1,13,073/- బాధితులకు అందజేశారు. మొత్తం 3 మంది బాధితులకు రూ.165,757 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత లబ్ధిదారులు తమ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి, తమ సమస్యలను గుర్తించి స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, ఎస్ఐ పి.తిరుపాలు, వేంపేంట గ్రామ టీడీపీ నాయకులు నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ)ఆల్ఫ్రైడ్, ముద్దపాటి ప్రసాద్, వేమా రెడ్డి, బోనాల భాస్కర్, చిన్న పక్కిరయ్య, సుబ్బారావు, చిన్న హుస్సనయ్య, టిడిపి మండల నాయకులు డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, ఎర్రగూడూరు హరినాధ రెడ్డి, కృష్ణానగర్ ముడియాల.సుబ్బారెడ్డి, పాండురంగారెడ్డి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News