ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన దాదాపు 20 కుటుంబాల వైసిపి కార్యకర్తలు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్, డివిఎంసి మెంబర్ లింగాల.నాగరాజు ల ఆధ్వర్యంలో అల్లూరు గ్రామంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య మరియు నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే గిత్త. జయసూర్య పార్టీ కండవాలు మెడలో వేసి, సాదరంగా ఆహ్వానం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నందికొట్కూరు మార్కెట్ డైరెక్టర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి, టిడిపి పాములపాడు మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్, డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం మరియు గ్రామాలలో రోడ్లు, మౌలిక వసతులను చూసి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, అలాగే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి గ్రామాలలోని, వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీకి సేవ చేసి మంచి గుర్తింపు తేవాలని, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ మద్దతు దారులను అఖండ మెజార్టీతో గెలిపించి నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర.శివానందరెడ్డి కి కానుకగా ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా మండలంలోని, ఇతర గ్రామాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు త్వరలో భారీ సంఖ్యలో చేరే అవకాశం ఉందని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో వారిలో బత్తిని బాలయేసు, లింగాల జకరయ్య, యువరాజు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, బత్తిని నరసన్న, మల్లెపూవు రమేష్, ఎల్.శ్రీనివాసులు, లింగాల విజయ్, కుమార్, తెరిపూగు రాజు, లింగాల అమర్, ఎల్.ప్రేమరాజు, బత్తిని రమేష్, శ్యామలమ్మ, అంకమ్మ, జయ లక్ష్మమ్మ, లక్ష్మీదేవి, సుబ్బలక్ష్మి, పద్మమ్మ, మల్లెపోగు రమణమ్మ, లింగాల నీలమ్మ, లింగాల రాజేష్, లింగాల సదానందం, తదితరులు చేరడం జరిగింది.
Admin
E Nivas News